13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన కలెక్టర్

31-03-2026 04:24 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని మంగళవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సందర్శించారు. ఫ్యాక్టరీలోని గోదాములను పరిశీలించి, రాబోయే రబీ సీజన్‌లో వడ్ల నిల్వకు అనుకూల పరిస్థితులు ఉన్నాయా అనే అంశాన్ని సమీక్షించారు. గోదాముల భద్రత, ప్రమాణాలు తేమ నియంత్రణ వంటి విషయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే గ్రామంలో జరుగుతున్న ఇందిరామ్మా ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.