ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని పరిశీలించిన కలెక్టర్
31-03-2026 04:24 PM
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామంలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని మంగళవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సందర్శించారు. ఫ్యాక్టరీలోని గోదాములను పరిశీలించి, రాబోయే రబీ సీజన్లో వడ్ల నిల్వకు అనుకూల పరిస్థితులు ఉన్నాయా అనే అంశాన్ని సమీక్షించారు. గోదాముల భద్రత, ప్రమాణాలు తేమ నియంత్రణ వంటి విషయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే గ్రామంలో జరుగుతున్న ఇందిరామ్మా ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.




