calender_icon.png 20 June, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుబాటులో ఉండి సేవలందించాలి

18-06-2025 12:00:00 AM

 జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

జగిత్యాల అర్బన్, జూన్ 17 (విజయక్రాంతి): ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా సేవలందించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాలోని మల్లాపూర్, రాయికల్ పోలీస్ స్టేషన్ లను ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ల పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలు, రికార్డులు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అలసత్వం తగదని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పిర్యాదులపై తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండాలన్నారు.

బ్లూ కోల్ట్, పెట్రోకార్ సిబ్బంది 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందిస్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు.పాత నేరస్థుల పై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు,అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. ఎస్పి వెంట ఎస్‌ఐలు రాజు, సుదీర్ రావు సిబ్బందిఉన్నారు.