calender_icon.png 21 June, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిల్లుపై బీజేపీ,కాంగ్రెస్ ద్వంద వైఖరి!

18-06-2025 12:00:00 AM

  1. కాంగ్రెస్ చేతిలో బీసీలు మోసపోయారు..

కేంద్రం బిల్లు ఆమోదించాకే స్థానిక ఎన్నికలు 

లేనిపక్షంలో జూలై 17న రైల్రోకో చేపడుతాం

బీసీలకు ఉద్యోగ, రాజకీయంగా నష్టం

బీసీ డిక్లరేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో..

జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మెదక్, జూన్ 17(విజయక్రాంతి):కులగణన పేరుతో కాం గ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని, కులగణనలో ఇత ర కులాలను ఎక్కువ చూపి బీసీల సంఖ్య తక్కువగా చూపిందని, బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్, బీజేపీ దొందుదొందేనని జాగృ తి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దుయ్యబట్టారు.

మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలో జాగృతి, యునైటెడ్ పూలేఫ్రంట్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ రౌం డ్ టేబుల్ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగ పరంగా సరైన న్యాయం జరగాలంటే తెలంగాణ ఉద్యమంలా బీసీ ఉద్యమం జరగాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లు తూతు మంత్రంగా అసెంబ్లీలో ఆమోదించి కేం ద్రంకు పంపి చేతులు దులుపుకోగా కేంద్రం పెండింగ్లో పెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న స్థానిక ఎంపీ రఘునందన్ రావు ఒక్కనాడు కూడా బీసీ బిల్లుపై పార్లమెంట్ లో నోరు విప్పలేదని విమర్శించారు. బీసీల సత్తా చా టాలంటే కేంద్రంపై ఒత్తిడి పెంచి వచ్చే నెల 17న రాష్ట్రం నుండి వెళ్లే రైళ్లను ఆపాలని పిలుపునిచ్చారు.

నేటి నుండి 30 రోజుల పాటు బీసీ కుల సంఘాలతో చర్చించి ఉద్యమానికి శ్రీకారం చుడుదామని పిలుపునిచ్చారు. కామారెడ్డి బీసీ బిల్లు రాజ్యాం గ బద్దంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి 33 శాతం మహిళల ఉపకోట ఉండే విదంగా బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. గ్రామ గ్రామాల్లో బీసీలు చైతన్యం కావాలని తద్వారా సర్పంచ్ లు, వార్డు మెంబర్స్, ఎమ్మెల్యే, ఎంపీ స్థాయికి ఎదగాలని సూచించారు.

తాము నిర్వహించిన ఈ సమావేశం రా జకీయ వేదిక కాదని మానవ హక్కుల వేదిక అని స్పష్టం చేశా రు. జాగృతి సకాలంలో స్పందించినందుకే ప్రభుత్వం బీసీ బిల్లు ఆమోదించిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో యూపీఎఫ్ స్టేట్ కన్వీనర్ బొల్లా శివశంకర్, తెలంగాణ జాగృతి ప్రధా న కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, నాయకులు సంపత్ గౌడ్, ఈగ సంతోష్, నరేందర్ యాదవ్, లింగం, ఆనంద్, లలిత యాదవ్, మహేందర్ ముధిరాజ్, శ్రీకాంత్, రాధాకృష్ణ, తేజ, యూపీఎఫ్ స్టేట్ కో ఆర్డినేటర్ ఆలకుంట హరి, కో కన్వీనర్లు కొట్టాల యాదగిరి, విజయేంద్ర సాగర, కుమారస్వామి, గోపు సదానందం, కార్మిక సంఘం నాయకుడు ఎల్. రూప్ సింగ్ తో పాటు సిద్దిపేట, సంగారెడ్డి మెదక్ జిల్లా బీసీ కులాల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.