calender_icon.png 13 June, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బడిలోనే మెరుగైన విద్య

12-06-2025 09:54:58 PM

మెదక్ డీఈఓ డా. రాధాకిషన్..

పాపన్నపేట: ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందని మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్(District Education Officer Radha Kishan) పేర్కొన్నారు. పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా గురువారం పాపన్నపేట మండల పరిధిలోని గాజుల గూడెం ప్రాథమిక పాఠశాలను డీఈఓ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు గాను ప్రభుత్వం ఈసారి నుండి పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఎంపిక చేసిన పాఠశాలల్లో సైతం ఏఐ ద్వారా బోధన జరుగుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులచే విద్య బోధన జరుగుతుందని దీనివల్ల విద్యార్థులు అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకునే అవకాశం ఉందన్నారు.

గాజుల గూడెం గ్రామంలోని ప్రజలు ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్నటువంటి 15 మంది విద్యార్థులని ప్రభుత్వ పాఠశాల పై నమ్మకంతో ఈ విద్యా సంవత్సరం నుండి చేర్పించడం హర్షించదగ్గ విషయమన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట ఆశించిన ఫలితాలనిస్తుందన్నారు. అనంతరం విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలను అందజేశారు. పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, గ్రామస్తులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం మండల విద్యాధికారి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... పాఠశాల అభివృద్ధికి గ్రామస్తుల సహకారం అవసరమని పేర్కొన్నారు.

ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ బాలాగౌడ్ మాట్లాడుతూ... పాఠశాల ఉపాధ్యాయుల పనితీరు బాగుందని, పాఠశాల అభివృద్ధికి తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. అంతకుముందు పాఠశాలకు తొలి రోజు హాజరైన విద్యార్థులకు పూలతో స్వాగతించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ అంజు మల్లేశం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయిసిరి, ఉపాధ్యాయులు రవీందర్ రెడ్డి, వేణుగోపాల్, సాయిలు చారి, పిఎసిఎస్ పాపన్నపేట చైర్మన్ మల్లేశం గుప్త, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.