07-06-2025 12:25:30 AM
ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరు వెంకట రామ నరసమ్మ
తుంగతుర్తి జూన్ 6 : మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంపటి , తుంగతుర్తి గొట్టిపాటి అన్నారం కొత్తగూడెం వెలుగు పల్లి పాఠశాలల ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించడం జరిగింది.. విద్యార్థులను గుర్తించి నూతన అడ్మిషన్లు నమోదు చేసుకోవడం జరిగింది...
ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిత్తలూరి వెంకట్రామనర్సమ్మ,మేడబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ అనుభవజ్ఞులైన ఉన్నత విద్యార్హతలు కలిగినఉపాధ్యాయులచే ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యా బోధన కొనసాగిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, రెండు జతల యూనిఫామ్స్ మరియు వారానికి మూడు గుడ్లతో నాణ్యమైన భోజనం అందిస్తున్నామని ఆహ్లాదకరమైన వాతావరణం అధునాతనమైన టాయిలెట్స్ ప్రతి తరగతిలో తరగతిలో డెస్క్ బెంచీల సదుపాయం, క్రీడలు విభిన్న సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని వివిధ రకాల పోటీ పరీక్షలకు తర్ఫీదునిస్తున్నామని, విద్యార్థులను పఠనాశక్తిని పెంపొందించుకోవడానికి గ్రంథాలయాల నిర్వహణ, ఎలాంటి ఫీజులు లేకుండా విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించి సర్వతో ముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న మా పాఠశాలలకు పిల్లలను చేర్పించాలని వారి ప్రగతికి బాటలు వేయుటకు సహకరించాలని కోరారు..
ఉభయ పాఠశాలలను ఉపాధ్యాయ బృందం పాలకుర్తి ఎల్లయ్య, మల్లెపాక రవీందర్, గట్టు మాధవి, నిమ్మనబోయిన నవీన, బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్ట గడుపుల విక్రం, మాలోతు కృష్ణ, గుండ్ల ఆంజనేయులు,గుడిపూడి సుచిత, ముచ్చసురేందర్రావు, ఎడ్ల గోపయ్య, పాలవెల్లి ప్రేమయ్య, ఉబ్బపల్లి బాలయ్య, తూము వెంకటేశ్వరరావు.. విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు