17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

భద్రాద్రి రామయ్య తెప్పోత్సవం

30-12-2025 01:09 AM
  1. గోదావరిలో హంస వాహనంపై నది విహారం చేసిన సీతారాములు
  2. తరలివచ్చిన భక్తులు

భద్రాచలం, డిసెంబర్ 29 (విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో వైకుం ఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి గోదావరి నది తీరంలో కన్నుల పండువగా సీతారామచంద్రస్వామి వారి తేప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. 

వేలాది మంది భక్తులు స్వామివారి తెప్పోత్సవం తిలకించి పరవశించిపోయారు. మంగళవారం ఉదయం మిథిలా స్టేడియం వద్ద వైకుంఠ ద్వారం నందు వైకుంఠ ద్వార దర్శనం సైతం దేవస్థానం అధికారులు నిర్వహించడానికి సిద్ధపడుతున్నారు. గోదావరి నది తీరంలో విద్యుత్ దీపాలతో అలంకరించబడిన వాహనంపై స్వామివారు నదీ విహారం చేశారు.

ముక్కోటి వైకుంఠ ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలో డిసెంబర్ 20వ తేదీ నుండి 28వ తేదీ వరకు భద్రాద్రి రామయ్య అవతారాలు నిర్వహించగా మంగళవారం తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. తెప్పోత్సవంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ పాల్గొన్నారు.