20-07-2025 01:15:33 PM
హైదరాబాద్: లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలో బోనాల పండుగ ప్రశాంతంగా జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిలో అనాదిగా బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. గోల్కొండలో మొదలైన ఈ ఉత్సవాలు, సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల వరకు జరుగుతుందని చెప్పారు. దీంతో ఇవాళ ప్రభుత్వం తరపున భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని, పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు భట్టిని ఘనంగా సత్కరించారు. ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.1290 కోట్లు, బోనాలకు ప్రత్యేకంగా రూ.20 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు.