1 July, 2026 | 6:40 PM

Breaking News

బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •   జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా పేదలకు ఉచిత వైద్య శిబిరం   •  

భూభారతి చట్టం సామాన్యులకు ఆయుధం

30-04-2025 12:00 AM

మోతే, ఏప్రిల్28:-  భూభారతి చట్టం సామాన్య రైతులకు ఆయుధం లాంటిదని తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా టీమ్ లీడర్ పల్లెల లక్ష్మణ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో స్వస్తిక్ పంక్షన్ హల్ లో ఇన్చార్జి తహసీల్దార్  శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన భూభారతి చట్టం రైతులకు అవగాహన కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాజాత ప్రదర్శనతో చట్టం పై అవగాహనతో పాటు లోపాలను సవరించుకోవడం వంటి అంశాలను అధ్యయనం చేసుకోవాలని కోరారు. ప్రతి రైతు ఏసమస్యలు అన్న స్థానిక తహసీల్దార్ కు మరియు డివిజనల్ అధికారికి పిర్యాదు చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఆదేశాల అనుసారంగా జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు పాలకూర్తి శ్రీకాంత్, గడ్డంఉదయ్, పల్లెల రాము, పాక ఉపేందర్, మాగి శంకర్, గంట భిక్షపతి, వేముల శ్రవణ్, కాటినాగరాజు, మేడిపల్లి వేణు, కుంద మల్లనాగలక్ష్మి, గజ్జి మంజుల, ఒంటెపాక ప్రియాంక, మేడి ప్రియదర్శిని, పోతరాజు శిరీష, నెమ్మది స్రవంతి, మేడి ఇంద్రజ, తదితరులు పాల్గొన్నారు.