11-06-2025 12:09:14 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
సూర్యాపేట, జూన్ 10 (విజయక్రాంతి): భూ సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం భూభారతి ని అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. మంగళవారం జిల్లాలోని ఆత్మకూర్ (ఎస్) మండలంలో జరుగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా గ్రామస్థాయిలో రెవెన్యూ సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు.
తదుపరి రెవెన్యూ సదస్సులో మొత్తం 261 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ముందుగా ఆత్మకూరు (ఎస్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలోని పలు రికార్డులను పరిశీలించి సిబ్బందిని పలు అంశాలపై ఆరా తీశారు. తాసిల్దార్ అమీన్ సింగ్, ఆర్ ఐ ప్రదీప్, జూనియర్ అసిస్టెంట్లు అజయ్, సుధాకర్, ఎం పి ఎస్ శంకర్, పాల్గొన్నారు.