11-06-2025 12:10:03 AM
చేవెళ్ల , జూన్ 10 : ఆన్లైన్లో రమ్మి గేమ్స్ ఆడుతూ.. అప్పులు చేసి జీవితంపై విరక్తి చెంది వ్యక్తి రేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. శంకర్పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబా ద్ కేపీహెచ్బీ కాలనీకి చెందిన బండి రామా మైసూర్రెడ్డి (43) వ్యాపారం చేస్తూ భార్య బండి మళ్లికారెడ్డి (34), ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నారు.
కాగా బండి రామా మైసూర్రెడ్డికి ఆన్లైన్లో ఆడే రమ్మీ గేమ్స్కు బానిసై అధి కంగా అప్పులు చేశాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో శంకర్పల్లి ఎక్స్రోడ్డులోని విష్ణు లాడ్జ్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. భార్య బండి మళ్లికారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లుసీఐతెలిపారు.