11-06-2025 12:09:03 AM
అచ్చంపేట, జూన్ 10: రైతులకు ఎకరాకు రూ. 7,500 చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో అచ్చంపేట తాసిల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పి. గోపాల్, తాలూకా నాయకుడు ఎస్.మల్లేష్ మాట్లాడారు.
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఇంటి నిర్మాణం కోసం రూ. 10 లక్షల సహాయం అందించాలని కోరారు. రైతులందరికీ రుణమాఫీ ఇవ్వాలని, లేకపోతే పెద్ద ఎత్తు న ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు డి. బాలచంద్ర య్య, గౌరయ్య, ఎన్. తిరుపతమ్మ, పెంటయ్య, వెన్నెల ఆనందు, ధర్మశీల, జంగయ్య, డి. లింగం, జై బక్కయ్య, శాంతమ్మ, కుమార్ తదితరులుపాల్గొన్నారు.