calender_icon.png 26 June, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి దరఖాస్తులు ఆన్‌లైన్ ప్రక్రియ వేగవంతం చేయాలి

26-06-2025 01:10:19 AM

జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి, జూన్ 25(విజయక్రాంతి): భూ భారతి  రెవిన్యూ సదస్సు లో ప్రజల నుండి వచ్చిన  దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా  కలెక్టర్ పి ప్రావీణ్య ఆర్డీవోలను, మండల తహసీల్దార్ లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, మండల తహసీల్దార్ లతో  కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి రెవిన్యూ సదస్సు లో వచ్చిన దరఖాస్తులు వేగవంతంగా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.  భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధించిన అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలని అన్నారు. అన్ని మాడ్యుల్స్ లో దాఖలైన భూ భారతి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని అన్నారు.

భూ భారతి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.సక్సేషన్, పెండింగ్ మ్యూ టేషన్, డేటా కరెక్షన్ వంటి దరఖాస్తులను అవసరమైన రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనేపరిష్కరించాలని,దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతే పరిష్కరించాలని అన్నారు.

ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను మండల తహసీల్దార్  లాగిన్ లో ఉన్న  దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు  కృషి చేయాలని అధికారులకు సూచించారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణజరపాలన్నారు.

అవసరమైన రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించిపరిష్కరించాలన్నారు.  ఈ కార్యక్రమంలో  రెవిన్యూ అదనపు కలెక్టర్  మాధురి, రెవిన్యూ డివిజనల్ అధికారులు రవీందర్ రెడ్డి , అశోకచక్రవర్తి ,పాండు, రామ్ రెడ్డి, మండల తహసీల్దార్ పాల్గొన్నారు.