calender_icon.png 9 June, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో ముమ్మరంగా కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు

09-06-2025 05:45:00 PM

వలిగొండ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంలో భాగంగా రైతుల సమస్యలు తీర్చేందుకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సులు(Bhu Bharathi Revenue Conferences) ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈనెల 3 నుండి వలిగొండ మండలంలో ప్రారంభమైన భూభారతి రెవెన్యూ సదస్సులు సోమవారం నాటికి 10 గ్రామాలలో ముగిశాయి.

గ్రామాలలో ఏర్పాటుచేసిన భూభారతి రెవెన్యూ సదస్సులకు రైతులు తమ సమస్యలను దరఖాస్తుల ద్వారా అందజేస్తూ ప్రభుత్వం రైతుల వద్దకే భూ సమస్యల పరిష్కారానికి అధికారులను పంపించడం అభినందనీయమని తమ సమస్యలను పరిశీలించి పరిష్కరించాలని కోరుతున్నారు. కాగా మండలంలో రైతుల భూ సమస్యల పరిష్కారానికి రెండు టీమ్ లను ఏర్పాటు చేయగా తహసిల్దార్ దశరథ ఆధ్వర్యంలో ఒక టీమ్, డిప్యూటీ తహసిల్దార్ పల్లవి ఆధ్వర్యంలో మరొక టీమ్ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ రైతులు తమ భూ సమస్యలను రవీందర్ సదస్సులో పరిష్కరించుకోవాలని వారు రైతులకు తెలియజేస్తున్నారు.