09-06-2025 05:42:44 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని మొగిలిపాక గ్రామానికి చెందిన మరల పవిత్ర గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) తన నిధుల నుండి రెండు లక్షల 50 వేల రూపాయల ఓసి చెక్కును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మామిడి సత్తిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు పబ్బు ఎల్లయ్య, జై సింహా రెడ్డి, నరేంద్ర చారి, అంజిరెడ్డి, నిషాకర్ రెడ్డి, మరల నరసింహ, షేక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.