calender_icon.png 9 June, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రిషి కళాశాల అద్భుతాలను సృష్టిస్తుంది

09-06-2025 05:51:16 PM

రిషి బాలికల క్యాంపస్ ప్రారంభోత్సవంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): అభివృద్ధికి ఎప్పుడూ ఏం కావాలన్నా అందుబాటులో ఉంటూ అవసరమైన సదుపాయాలను అందిద్దామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. సోమవారం మహబూబ్ నగర్ పట్టణంలోని తిరుమల హిల్స్ లో స్థాపించిన రిషి జూనియర్ కళాశాల(Rishi Junior College) బాలికల క్యాంపస్ ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పాలమూరు యూనివర్సిటీ(Palamuru University)లో లా, ఇంజనీరింగ్ కళాశాలలను మంజూరు చేయించడం జరిగిందన్నారు. మంచి మంచి విద్యాసంస్థలు మన మహబూబ్ నగర్ కు వస్తున్నాయని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశ్శీస్సులతో మహబూబ్ నగర్ కు ఐఐఐటి కళాశాలను తీసుకురావడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మహబూబ్ నగర్ అభివృద్ధికి ఏమి కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు.

149 మున్సిపాలిటీలలో ఒకటిగా ఉన్న మహబూబ్ నగర్ ఇప్పుడు 16 మున్సిపల్ కార్పొరేషన్ లలో ఒకటిగా మార్చుకున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అత్యధిక సంఖ్యలో నిధులు తెచ్చి మహబూబ్ నగర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ కార్పోరేషన్ గా మారినందుకే మనకు ఐఐఐటి కళాశాల మంజూరు కావడం జరిగిందని చెప్పారు. ఎంతోమంది విద్యార్థులను ఇంజనీర్లు గా, డాక్టర్లు గా తయారు చేసిన రిషి జూనియర్ కళాశాల తిరుమల హిల్స్ లో నూతన క్యాంపస్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.  హైదరాబాద్ లోనీ నారాయణ శ్రీ చైతన్య కళాశాలల కంటే అత్యుత్తమమైన విద్యను మన మహబూబ్ నగర్ లో ఉన్న కళాశాలు అందిస్తున్నాయని ఆయన చెప్పారు.

రెండు సంవత్సరాలు కష్టపడితే మీ జీవితం గొప్పగా ఉంటుందని, సమయం వృధా చేస్తే, జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. మీరు గొప్పగా ఎదగాలని, మీ తల్లిదండ్రులు మీపై ఉంచుకున్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా కష్టపడి చదువాలని, లక్ష్యం మీద మీ ద్యాస ఉంచాలని ఆయన సూచించారు. మన మహబూబ్ నగర్ ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు సైతం 114 మంది ఎప్సెట్ లో ఉత్తమ ర్యాంకులు సాధించారని, ఇది మన ప్రభుత్వ కళాశాలల విజయమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, టి పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మోహన్ రెడ్డి, చంద్రకళ వెంకటయ్య, లక్ష్మణ్,  లీడర్ రఘు తదితరులు పాల్గొన్నారు.