12-02-2026 05:57:53 PM
నిర్మల్,(విజయక్రాంతి): సరస్వతి శిశు మందిర్ బుధవార్పేట్ పాఠశాలలో స్వామి దయానంద సరస్వతి జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి అయిన ముదుల్కర్ శ్రీకాంత్ మాట్లాడుతూ... స్వామి దయానంద సరస్వతి 1824 ఫిబ్రవరి 12 నాడు జన్మించాలని తెలియజేశారు. ఈయన సత్యార్థ ప్రకాశ గ్రంథం రచించాడు, ప్రజలను చైతన్య పరిచారు.
గో బ్యాక్ టు వేదాస్ అని నినాదాన్ని మనకు అందించారు. మనమంతా సమానమ మనమంతా ఒకటే గురుకులం అనే విషయాన్ని ప్రేరేపించాడు. దయానంద సరస్వతి ని సావర్కర్ అండమాన్ జైల్లో బంధించారు అప్పుడు ఆయనపై విశ్వప్రయోగం కూడా చేశారు. కానీ ఆయన సత్యాన్ని మాట్లాడుతా సత్యం వైపే నడుస్తా. సత్యాన్ని పాటిస్తా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఆచార్యులు పాల్గొన్నారని. పాఠశాల ప్రధానాచార్యులు కొండూరు నరేష్ గారు తెలియజేశారు.