calender_icon.png 13 August, 2025 | 8:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగ ఓట్లతో అధికారంలోకొచ్చిన బీజేపీ

13-08-2025 12:00:00 AM

నిజామాబాద్ ఆగస్టు 12: (విజయ క్రాంతి) : దేశంలో ఎలక్షన్ కమిషన్ ను అడ్డుపెట్టుకొని నరేంద్ర మోడీ  ఓట్ల దొంగతనానికి పడ్డాడని ఆరోపిస్తూ నిరసనగా ఈ మంగళవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి  నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టి  బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు కాంగ్రెస్ నాయకుల మధ్య స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.

వెంటనే కాంగ్రెస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ఎలక్షన్ కమిషన్ ను తన గుప్పిట్లో పెట్టుకొని దొంగ ఓట్లు సృష్టించి అధికారంలోకి వచ్చారన్నారు.

కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్,రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామ కృష్ణ,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్,రాష్ట్ర  ఎన్ ఎస్ యు ఐప్రధాన కార్యదర్శి వేణు రాజ్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,జిల్లా sc సెల్ అధ్యక్షులు లింగం,జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షులు యాదగిరి,వివిధ ఆలయాల చైర్మన్ లు లవంగ ప్రమోద్, మధు సుధాన్,మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామ కృష్ణ,నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు వినయ్, సంగెం సాయిలు మరియు తదితరులు పాల్గొన్నారు.