13-08-2025 08:15:06 PM
మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్..
మునిపల్లి: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్(SI Rajesh Nayak), ఎంపీడీవో హరి నందన్ రావు తెలిపారు. బుధవారం నాడు మండలంలోని సింగూరు ప్రాజెక్టు పరివాహక ప్రాంతం, మునిపల్లి చెరువును సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వర్షాల కారణంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే తమకు సమాచారం అందించాలని సూచించారు. వారి వెంట ఎంపీఓ అండాలమ్మ తదితరులు ఉన్నారు.