calender_icon.png 30 June, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందారంలో మన్ కీ బాత్ ను వీక్షించిన బీజేపీ నాయకులు

29-06-2025 07:09:10 PM

మందమర్రి (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినెల నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం(Mann Ki Baat Program)లో జైపూర్ మండలం బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మండలంలోని ఇందారం గ్రామంలో ఆదివారం మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి చేగుంట శ్రీనివాస్ యాదవ్ నివాసంలో మన్ కి బాత్ కార్యక్రమాన్నివీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ పాల్గొని ప్రధాని కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి పలు అంశాలను ప్రస్తావించారన్నారు.

దేశాన్ని కంటి వ్యాధి నుండి విముక్తి పొందిన దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందని, ఇది దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు సాధించిన విజయమన్నారు. ఈనెల 21న దేశవ్యాప్తంగా లక్షలాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారనీ, దివ్యాంగులు పాల్గొనడం విశేషమని, యోగా ఎంత శక్తివంతమైన సాధనంగా ఉంటుందో వారు చూపించారని, దేశ విదేశాల్లో యోగా వేడుకలు జరిగాయని ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కొరివి సాయి కుమార్, పళ్ళ రాజశేఖర్, మీరు రాజేష్, రాచబత్తుల చంద్రమౌళి, రామగిరి రాము, గణేష్, శ్రీకాంత్, కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు.