మూడుసార్లు గెలిచి ఏం అభివృద్ధి చేశావు

27-04-2024 02:51:56 AM

సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ ఎంపీ అభ్యర్థి అరుణ సవాల్

 కొడంగల్, ఏప్రిల్ 26: కొడంగల్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెల్చి ఏం అభివృద్ధి చేశావో ప్రజలకు చూపించాలని మహబూబ్‌నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్య ర్థి డీకే అరుణ సీఎం రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం కొడంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి డీకే అరుణ చేసిందేమి లేదని సీఎం అనడం హాస్యస్పదంగా ఉందన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో గద్వాలలో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్ కళాశాలు కట్టించినట్లు వెల్లడించారు.

ప్రతి ఎకరాకు నీరు ఇచ్చి, ప్రతి పల్లెకు రోడ్లు వేయించినట్లు తెలిపారు. తనకు వస్తున్న ఆదరణ చూసి సీఎం ఓర్వలేకపోతున్నారని, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బయపెట్టిస్తున్నారని ఆరోపించారు. కల్వకుర్తి నుంచి వచ్చి ఇక్కడ బెదిరింపులకు పాల్పడితే బయపడేవారు లేరని పేర్కొన్నా రు. మా కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో పాలమూరు ఎత్తిపోతల గురించి ఏనాడు మాట్లాడలేదని ఆరోపించారు. ఇప్పుడు సీఎం మాట లు నమ్మి ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేద ని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.