calender_icon.png 29 June, 2025 | 8:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బల్కంపేట ట్రస్ట్ బోర్డులో పేదలు, మహిళలు

29-06-2025 02:07:55 AM

డాక్టర్ కోట నీలిమ

సనత్‌నగర్, జూన్ 28 (విజయక్రాంతి): బోనాల పండుగ వేళ ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకుంది. బల్కంపేట ఎల్లమ్మ-పోచమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. మొత్తం 13 మందితో బోర్డు ఏర్పాటు చేస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొత్తగా నియమితులైన సభ్యులు పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమను శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు.

తమ నియామకానికి సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ బోర్డును ఏర్పాటు పట్ల కోట నీలిమ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ యేడాది బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ఇందుకోసం ఆలయాలకు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించిందన్నారు. కాం గ్రెస్ ప్రభుత్వంలో లాబీయింగ్లకు అవకాశం లేదని.. కష్టపడ్డ వారినే పదవులు వరిస్తాయని స్పష్టంచేశారు.

కొత్త బోర్డులో దాదాపు 60 శాతంకి పైగా వైట్ రేషన్ కార్డుదారులు ఉన్నారని తెలిపారు. పార్టీ కోసం కష్టపడ్డది పేద, మధ్య తరగతి వారైనా సరే వారికే పదవులు వస్తాయని తెలిపారు. నూతనంగా బల్కంపేట ఎల్లమ్మ-పోచమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డులో 13 మందిలో ముగ్గురు మహిళలే ఉన్నారని చెప్పారు.

మహిళా సాధికారతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు మొదటి ప్రాధాన్యం కల్పించి వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టంచేశారు. రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా బల్కంపేట ఆషాఢ మాస బోనాలు వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భక్తుల కు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని ట్రస్ట్ బోర్డు సభ్యులకు సూచించారు.