13-06-2025 10:10:22 PM
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు
మహాదేవపూర్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీలో లాగా బానిసలను కాదు... దేశ స్వతంత్రం సాధించుటలో తెలంగాణ ఇచ్చిన పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం మహదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు శుక్రవారం విలేకరుల సమావేశంలో అన్నారు. బిఆర్ఎస్ మాజీ శాసనసభ్యులు పుట్ట మధుకర్ మంథినిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులకు పదవులు రావడంలేదని పేర్లు పెట్టి ఆరోపించారు. ఈ ఆరోపణలపై మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు మాట్లాడుతూ... తాను కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ స్థాయికి చేరానని కాంగ్రెస్ పార్టీ తనను ఎప్పుడు విస్మరించలేదని పార్టీలో తనకు అత్యున్నత స్థానంతో పాటు సరైన గుర్తింపును ఇచ్చిందని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుల పై కపటప్రేమ నాటిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అన్యాయం జరిగిందని అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాడని, కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి మంథిని నియోజకవర్గంలో తనకు స్థానం లేదని తెలిసి ఉనికి కోసమే ఈ తప్పుడు ప్రకటనలు చేస్తూ కాంగ్రెస్ నాయకులపై కపట ప్రేమ నటిస్తున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు 1984 సంవత్సరంలోనే మహదేవపూర్ సమితి కోఆప్షన్ సభ్యునిగా ఆనాటి నాయకుడు స్వర్గీయ శ్రీపాదరావు అవకాశం కల్పించినాడని జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు గా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు మేజర్ గ్రామపంచాయతీ మహాదేవపూర్ సర్పంచిగా అవకాశం కల్పించారని తనకు కాళేశ్వరం దేవస్థానం చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చిందని, అదేవిధంగా మహదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి సైతం ప్రస్తుత మంత్రి శ్రీధర్ బాబు తనకు ఇచ్చాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో తాను సీరియర్ నాయకునిగా గుర్తింపు ఉందని అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు తనను గుర్తిస్తు, ఉన్నతమైన స్థానం ఇస్తున్నాడని అదేవిధంగా పార్టీలో తనకు సముచితమైన న్యాయం జరిగిందని అన్నారు.మంథిని నియోజకవర్గంలో సీనియర్ నాయకులకు న్యాయం జరగటలేదని పుట్ట మధుకర్ అన్నదాంట్లో వాస్తవం లేదని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క నాయకునికి సరైన సమయంలో సరైన విధంగా అవకాశం కల్పించిన ఘనత మంత్రి శ్రీధర్ బాబు కే దక్కిందని అన్నారు. సముచిత స్థానం అనేది బిఆర్ఎస్ పార్టీలో ఏమాత్రం ఉందని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా పదవిలో ఉంటూనే ఆయన సతీమణి శైలజకు మంథిని మునిసిపల్ చైర్మన్ పదవి ఇప్పించాడని ఆయన ఇతర నాయకులకు ఆ పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మంతిని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు ఆయన కొడుకు తిరిగిన విషయం మరిచిపోరాదని గుర్తు చేశారు.
మంథిని నియోజకవర్గంలో దుద్దిల్ల కుటుంబ సభ్యులు తిరగడం, వారి స్వగ్రామంలో ప్రజలను కలవడంలో తప్పేమిటి అని, దీన్ని ఓర్చుకోలేని మాజీ ఎమ్మెల్యే తన ఉనికి అడ్రస్ లేకుండా పోతుందనే అక్కసుతూనే ఈ విధంగా తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలు మభ్యపెడుతున్నానని అతని మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ప్రజలు మరో మారు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మంథినిలో శ్రీధర్ బాబు నాయకత్వంలో బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ నాయకులకు, కార్యకర్తలకు సరైన న్యాయం జరుగుతుందని, అందుకే బడుగు బలహీన వర్గాలు మంథని నియోజక వర్గంలో శ్రీధర్ బాబుకు అండగా నిలుస్తున్న విషయం మరిచిపోరాదన్నారు. మంత్రి శ్రీధర్ బాబుకు ఎప్పుడైనా ప్రజల మద్దతు ఉంటుందని, లేనిపోని ఆరోపణ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలేరని అన్నారు.
శీను బాబు పై విమర్శలు సమంజసం కాదని, కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న దుద్దిల్ల శీను బాబును విమర్శించడం మాజీ ఎమ్మెల్యేకు తగదని అన్నారు. మంథిని నియోజకవర్గంలో పాటు పెద్దపెల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నాడని కార్యకర్తలకు అండదండగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటూ నాయకులకు కార్యకర్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ అన్ని వర్గాల వారికి చేయుతనిస్తున్న వ్యక్తిని విమర్శించే స్థాయి మాజీ ఎమ్మెల్యేకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో శ్రీను బాబుకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లో ప్రధాన కార్యదర్శిగాపదవి ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయమని కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యేకులేదని దుయ్యబట్టారు.