calender_icon.png 9 June, 2025 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిలో గల్లంతైన ఐదుగురు మృతదేహాలు లభ్యం

08-06-2025 07:51:45 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహాదేవపూర్ మండలం అంబటిపల్లి సమీపంలోని మేడిగడ్డ బ్యారేజీ ఎగువన గోదావరిలో శనివారం ఈత సరదాకి వెళ్లి గల్లంతైన ఆరుగురి యువకుల మృతదేహాలు ఆదివారం లభ్యమైనాయి. గోదావరిలో ఈత సరదాకి వెళ్లి గల్లంతైన యువకుల మృతదేహాలను వెలికితీయుటకు భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ నరేష్(District Additional SP Naresh), కాటారం సబ్ కలెక్టర్ మాంకా సింగ్, కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి సింగరేణి రెస్క్యూ బృందాన్ని రప్పించి రాత్రి 9 గంటల నుండి వెతకడం ప్రారంభించారు.

16 గంటలు గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం మధ్యాహ్నం మృతదేహాలు లభించాయి. ఈ యువకుల మృతదేహాలను మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఆసుపత్రి ప్రాంగణంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. రాష్ట్ర ఐటీ పర్సనల్ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) వ్యక్తిగత సాయకుడు ప్రవీణ్ పోస్టుమార్టం కిట్లు ఇచ్చి మృతుల బంధువులకు ధైర్యం చెప్పి ఓదార్చారు.