calender_icon.png 9 June, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం..

08-06-2025 07:47:09 PM

నాంపల్లి మండల మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గఫార్..

చండూరు/నాంపల్లి (విజయక్రాంతి): నాంపల్లి మండలం నేరేళ్లపల్లి గ్రామానికి చెందిన పొగాకు రాములు అనారోగ్యంతో మరణించారని విషయం తెలుసుకున్న నాంపల్లి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ గఫార్(Mandal Block Congress President Syed Ghaffar) వారి కుటుంబానికి రూ.10,000 లు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎవరికి ఆపద వచ్చిన ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటానని ఆయన అన్నారు. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ తీసుకుంటానని, మా గ్రామ అభివృద్ధి తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బచ్చనబోయిన రమేష్, యాదయ్య, మల్లయ్య, మాద రమేష్, కొండల్, వంగూరి సైదులు, ఉడుత పర్వతాలు, ఎడ్ల వెంకన్న, శ్రీరాములు, లింగస్వామి, మేకల రాజు, కర్నాటి అంజి, పల్లె క్షత్రయ్య, చందు పాషా, సైదు సేన్, హుస్సేన్, యాదయ్య, టేకులపల్లి వెంకన్న, ఎరుకల వెంకటేష్, ఎడ్ల చంద్రయ్య, ఎడ్ల అంజి, శ్రీశైలం, ఆక నరసింహ, ఆకలింగయ్య, నరసమ్మ, పెద్దలు, ఆంజనేయులు, శ్రీరాములు, సైదయ్య, పర్వతాలు, యాదయ్య, బచన బోయిన శ్రీను, ముసలయ్య, రామచంద్రం, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.