15-07-2025 12:59:30 AM
బుద్ధవనానికి ప్రాచుర్యంపై చర్చ
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రముఖ బాలీవుడ్ నటుడు, జీటీవీ రామాయణంలో రాముడి పాత్రధారి, బుద్ధ్ది జం ప్రచారకులు గగన్ మాలిక్ మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో వీరు సమావేశమయ్యారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనానికి ప్రపంచ దేశాల్లో ప్రాచుర్యం కల్పించడం, వివిధ బౌద్ధ దేశాలను బుద్ధ వనానికి రప్పించడం, వారి సాంస్కృతిక కేంద్రాలను బుద్ధవనంలో ఏర్పాటు చేయడం వంటి అనేక అంశాలపై చర్చించారు.
ఈ ఏడాది అక్టోబర్లో థాయ్లాండ్కు చెందిన బౌద్ధ్ద భిక్షవులు సుమారు 100 మందితో గుల్భర్గా మీదుగా బుద్ధవనానికి పాదయాత్రగా రావడం తదితర అంశా లను ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్యను గగన్ మాలిక్కు మంత్రి జూపల్లి పరిచయం చేశారు.