మానుకోటలో బాంబు స్క్వాడ్ తనిఖీలు
29-05-2026 02:31 AM
మహబూబాబాద్, మే 28 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఆదేశాల మేరకు బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా మహబూబాబాద్ పట్టణంలో బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
మహబూబాబాద్ టౌన్ సీఐ ఎల్.రఘుపతి రెడ్డి, జీ. ఉమ ఆధ్వర్యంలో ఈద్గా, దర్గాలు, పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, నెహ్రూ సెంటర్, తొర్రూరు బస్ స్టాండ్ సెంటర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీలలో అంజయ్య, అశోక్, మురళి (డాగ్ హ్యాండ్లర్), ఆర్పీఎఫ్ సిబ్బంది ఆర్. సార్య, కె. నాగిరెడ్డి, డాగ్ హ్యాండ్లర్ ఎల్. సునీల్ తదితరులు పాల్గొన్నారు.






