కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
మహబూబాబాద్, మే 28 (విజయక్రాంతి): కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామాలి కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆల్ హామాలి కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఈనెల 30న జనగామలో నాల్గవ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
మహాసభలను విజయవంతం చేయడానికి జిల్లా కేంద్రంలో వివిధ కార్మికుల అడ్డాల వద్ద ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ హమాలీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటుచేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, పెన్షన్, పిల్లల భవిష్యత్తు పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బత్తుల వెంకన్న, హేమ, లక్ష్మణ్, లాలు, కాంతి, బాలు, మన్ని, జ్యోతి, రాజేష్, హరి, సేవ్య, నవీన్, రాజు, రాము, మోహన్, ప్రసాద్, రంగన్న, మహేందర్, మల్లేష్, శ్రీను, రవి, ఐలయ్య, సారయ్య, బిచ్చ వెంకటనారాయణ, సాగర్, గణేష్, శ్రీరామ్, నరేష్, వినోద్, శ్రీనివాస్, చందు, లింగం, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.






