calender_icon.png 22 June, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు కిందపడి బాలుడి మృతి

22-06-2025 12:00:00 AM

జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీలో ఘటన

కుత్బుల్లాపూర్, జూన్ 21: సైకిల్‌పై ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తు స్కూల్‌బస్సు కిందపడి మృతి చెందిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన ముఖేష్ చౌహన్ హైదరాబాద్‌కు కుటుంబంతో వలస వచ్చి జగద్గిరిగుట్టలో వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ముఖేష్ చౌహన్ కుమారుడు జైసిత్ చౌహన్(10) ఆల్విన్ కాలనీలోని జీవన్ జ్యోతి స్కూల్‌లో 4వ తరగతి చదువుతున్నాడు.

శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్నేహితులతో కలిసి ఆల్విన్ కాలనీలోని తులసినగర్‌లో సైకిల్‌పై ఆడు కుంటున్నాడు. అదే సమయంలో కేపీహెచ్‌బీ కాలనీ గోకుల్ ప్లాట్స్ నడుపుతున్న క్వాంటం లీఫ్స్ స్కూల్ బస్సు విద్యార్థులను దించేందుకు తులసీనగర్‌కు వచ్చింది.

సైకిల్‌పై ఆడుకుంటున్న బాలుడు అదుపుతప్పి ప్రమాదవశాత్తు బస్సు ముందు టైర్ల కింద పడ్డాడు. డ్రైవర్ గమనించకుం డా బస్సును పోనివ్వడంతో బాలుడికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. తం డ్రి ముఖేష్ చౌహన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.