17 April, 2026 | 2:11 AM

యోగా డేలో డిప్యూటీ మేయర్ శ్రీలతశోభన్‌రెడ్డి

22-06-2025 12:00 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): గచ్చిబౌలిలో శనివారం ప్రభుత్వం అంతర్జాతీయ యోగా డే వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, మంత్రులు రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డితో పాటు సుమారు 5వేల మంది పాల్గొన్నారు. అన్నింటిలోకెల్లా గొప్ప సాధన యోగానేనని మంత్రి దామోదర అన్నారు. మారిన జీవనశైలిలో ఇది ఎంతో అవసరమని చెప్పారు. ఒత్తిడిని తొలగించి ధార్మిక చింతన పెంచుతుందని పేర్కొన్నారు.