బీజేపీకి ప్రజల బ్రహ్మరథం

28-04-2024 01:35:54 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): రెబ్బెన మండలంలోని నార్లపూర్ గ్రామంలో శుక్రవారం బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ సమక్షంలో పలువురు యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ.. దేశంలో ప్రధాని మోదీ చేపట్టిన సంస్కరణలకు యువత ఆకర్షితులై  బీజేపీలో చేరుతున్నారన్నారు. ఎక్కడ చూసినా ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని, మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని పేర్కొన్నారు. తన ను ఎంపీగా గెలిపిస్తే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్య క్రమంలో  నాయకులు కొత్తపల్లి శ్రీనివాస్, భూమన్న,  కొట్నాక విజయ్, ఆసి ఫాబాద్ జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, ఆత్మారాం, సొల్లు లక్ష్మి తదిత రులు పాల్గొన్నారు.