l పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు
పెద్దపల్లి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి) : కేంద్రంలో కాంగ్రెస్ అధికా రంలోకి వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్, కొదురు పాక, దేవునిపల్లి గ్రామాలతో పాటు ఎలిగేడు మండలంలోని రా ములపల్లి గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకి మద్దతుగా ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్రా ల్లో పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు. గడ్డం వంశీని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు.