29-05-2025 09:20:51 AM
హైదరాబాద్: బిల్డింగ్ పై నుంచి దూకి బోరబండ డివిజన్(Borabanda Division) బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు సర్దార్(28) ఆత్మహత్య చేసుకున్నాడు. బోరబండ ఎస్ ఆర్టీనగర్ లో భవనంపై నుంచి పడి సర్దార్ ప్రాణాలు తీసుకున్నాడు. బోరబండ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాబా ఫసియుద్దీన్(Baba Fasiuddin) వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ టార్చర్ తట్టుకోలేక తాను చనిపోతున్నా అని లేఖ రాసి సర్దార్ సూసైడ్ చేసుకున్నాడు. అయితే నీ చావుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం సర్దార్ అంటూ బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.