ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీకు ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్పాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రజలు ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ అనురాధ రాంరెడ్డి, నాయకులు పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.