08-09-2025 01:48:49 PM
హైదరాబాద్: ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని భారత రాష్ట్ర సమితి(BRS) నిర్ణయం తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉన్నందున పోలింగ్ కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఉపరాష్ట్రపతి పోలింగ్ రేపు జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పోటీ పడుతుండగా, విపక్ష కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు.