04-06-2025 11:15:36 PM
చోద్యం చూస్తున్న కార్పొరేషన్ అధికారులు...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ఆవిర్భావ దినోత్సవం ముగిసిన పాల్వంచ కార్పొరేషన్(Palwancha Municipality) పరిధిలోని నవ భారతి ఏరియాలో బిఆర్ఎస్ జెండాలు, బ్యానర్లు ఇంకా రెపరెపలాడుతున్నాయి. ఒకవైపు జిల్లా స్థాయి అధికారులు అనుమతి లేకుండా బ్యానర్లు, జెండాలు, కటౌట్లు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్న క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వేడుకల పూర్తయి మూడు రోజులైనా జెండాలో బ్యానర్లు మాత్రం రెపరెపలాడటం పట్ల అధికారుల తీరుపై విమర్శలు వెలబడుతున్నాయి. ఇప్పటికైనా వాటిని తొలగించాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.