05-06-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జూన్ 4 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం ద్వారా ప్రజల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్నదే లక్ష్యమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం లోకేశ్వరం మండలంలోని పొట్టపల్లి (బి), నర్సాపూర్ (జి) మండలంలోని బూరుగు పల్లి (కె) గ్రామాల్లో నిర్వహించిన భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సుల్లో ఆమె పాల్గొ న్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ.. రైతులు ఎదుర్కొంటున్న భూ సం బంధిత సమస్యలను పరిష్కరించేందుకు భూ భారతి చట్టాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. గ్రామస్తులు అందరూ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని తమ భూ సమస్యల వివరాలను అధికారులకు తెలి యజేయాలని సూచించారు. పొట్టపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రత్యక్షంగా రైతులను కలసి వారి భూ సమ స్యలపై వివరాలు అడిగి తెలుసు కున్నారు.
దరఖాస్తుల వివరాలు పరిశీలించి అధికారు లకు కలెక్టర్ సూచనలు చేశారు. ఆనంతరం బూరుగుపల్లి (కె) గ్రామానికి వెళ్లి న కలెక్టర్ అక్కడ జరిగిన రెవెన్యూ సద స్సులో మాట్లాడుతూ, ఏండ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూ సమస్యలు భూ భారతి చట్టం ద్వా రా పరిష్కారం పొందనున్నాయి తెలిపారు. జూన్ 3 నుండి 20వ తేదీ వరకు రెండో విడత భూ భారతి సదస్సులు జరుగనున్నా యని తెలిపారు.
గ్రామ సదస్సుల్లో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబం ధిత రిజిస్టర్లలో ఖచ్చితంగా నమోదు చేయా లని అధికారులకు సూచించారు. ఇంతకు ముందు కలెక్టర్ సమీపంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.
పాఠశాలలు ప్రారంభానికి ముందే విద్యార్థులకు అవ సరమైన అన్నీ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధి కారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, తాహసిల్దార్లు సర్పరాజ్, శ్రీకాంత్, అధికా రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత
నిర్మల్ జిల్లా మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మారే దిశగా సమాచార పౌర సం బంధాల శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందాలు మరింత ప్రభావవంతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించా రు.
బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో మాదకద్రవ్యాల నిర్మూలన, బాల కార్మిక నిర్మూలన, బాల్య వివాహాల నియంత్రణ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ చట్టాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఏర్పాటు చేసిన ప్రగతిరథం -ప్రజా చైతన్యం, ప్రచార రథయాత్ర వాహనాన్ని ఆమె జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మాదకద్రవ్యాల కారణంగా యువత భవిష్యత్తు అంధకారంలో నిత్యం నాశనమవుతోందని ఆందోళన వ్యక్తం చేశా రు. జూన్ 2న మాదకద్రవ్యాల రహిత నిర్మ ల్ జిల్లా స్థాపన కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో నెల రోజుల పాటు జిల్లావ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలి పారు.
మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలి గే దుష్పరిణామాలను గ్రామస్థాయిలోనూ స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, వయోవృద్ధుల హక్కులు, బాల్యవివాహాల నివారణ, బాల కార్మిక నిషేధం, సీజనల్ వ్యాధుల నియంత్రణ, ప్రభుత్వ అభివృద్ధి,
సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కళాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఇ. విష్ణువర్ధన్, కళాకారులు సుదర్శన్, నాగరాజు, రఘునాథ్, లక్ష్మణ్, సుదర్శన్, మాధ వి, తదితరులు పాల్గొన్నారు.