05-06-2025 12:00:00 AM
మంత్రి సీతక్కకు మాజీ ఎంపీ సోయం వినతి
అదిలాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జి.ఓ 49 తో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎంపీ సోయం బాపూరావ్ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా ఆదివాసీ నేతలతో కలిసి హైదరాబాద్లో ఉమ్మడి జిల్లా ఇం చార్జ్ మంత్రి సీతక్కని కలిసి జీవో 49పై వినతిపత్రం అందజేసి, జీవో వల్ల కలిగే నష్టాల ను ఆమె దృష్టికి తీసుకెళ్ళారు.
49 జీవోతో అడవులను నమ్ముకొని బ్రతికే ఆదివాసుల కు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ ఎంపీ సోయం బాపురావు అన్నారు. పక్కన ఉన్న మహారాష్ట్ర నుండి ఏనుగులు, పులులు వస్తున్నాయని, వాటి సంరక్షణ సాకుతో ఆదివాసీలను అడవి కి దూరం చెయ్యాలనే కుట్రలు జరుగుతోందన్నారు. పులులకు, ఏనుగులకు రక్షణ ఇచ్చే అటవీ అధికారులు మనుషులకు రక్షణ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చి న జీవో 49 వల్ల ఆదివాసులను వారి వ్యవసాయ భూములను సాగుచేయకుండా, టైగ ర్ జోన్ల, కంజర్వేషన్, రిజర్వడ్ ఫారెస్ట్ ప్రాం తాల పేరుతో సిర్పూర్, కాగజ్ నగర్ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో దాదాపు 250 గ్రామాల్లోని ఆదివాసులను అడవుల నుండి వెళ్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దింతో మంత్రి సీతక్క స్పందిస్తూ జీవో 49 తో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దమనఖాండను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికీ తీసుకువెళతాను మంత్రి సీతక్క హామీ ఇచ్చారన్నారు.