calender_icon.png 20 June, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల మండిపాటు

19-06-2025 08:39:26 PM

సిద్దిపేట (విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాల బ్రాండ్ అంబాసడర్‌గా మారిపోయారని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ(BRS State Secretary Veleti Radhakrishna Sharma), నాయకులు పాల సాయిరాం మండిపడ్డారు. నల్లమల తెలంగాణలో ఉందో రాయలసీమలో ఉందో తెలియని వ్యక్తి సీఎం అయినంత మాత్రాన ప్రజలకు మేలు జరగదని విమర్శించారు.

సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో నేతలు మాట్లాడుతూ... కేసీఆర్, హరీష్ రావులపై చేసిన వ్యాఖ్యలు అసత్యమని, రేవంత్ రెడ్డి కాలేశ్వరం ప్రాజెక్టు ఫలితాలను చూడాలని సవాల్ చేశారు. అఖిలపక్ష సమావేశానికి ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వకపోవడం వెనుక ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేమనే భయముందని ఆరోపించారు. మోదీ, చంద్రబాబు దిశానిర్దేశంలో రేవంత్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని సూచిస్తూ, ప్రజలే సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మీడియా సమావేశంలో పలువురు బీఆర్ఎస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.