19-06-2025 08:33:34 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహదేవపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థ గత ఎన్నికల సన్నాహక సమావేశం గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఐత ప్రకాష్ రెడ్డి, జిల్లా సంస్థ గత ఎన్నికల పరిశీలకులు కూడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాసంపల్లి లింగాజీ, పాల్గొని మాట్లాడుతూ... కష్టపడి పనిచేసే వారికే పార్టీ పదవులల్లో ప్రాధాన్యత ఇస్తామని, పార్టీని బలోపేతం చేయడానికి గ్రామస్థాయి నుండి బ్లాక్ స్థాయి వరకు కమిటీలు వేస్తున్నామని మొదటగా గ్రామస్థాయి కమిటీలను ఎన్నిక చేసిన తర్వాత మండల స్థాయి కమిటీలు ఎంపిక చేస్తామని తద్వారా మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు పార్టీకి సమయం కేటాయించి పనిచేసే వారిని ఎన్నికల ప్రవర్తన నియామావళి మేరకు సజావుగా కమిటీలు నియామకం పూర్తి చేస్తామని తెలిపారు.
క్షేత్రస్థాయిలో బలమైన నాయకులను ఈ కమిటీలలో ఎన్నిక చేస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సులువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. పదవులను అలంకరణ ప్రయంగా వంటి పెట్టుకునే వారికి అవకాశాలు ఇవ్వద్దని కష్టపడి పని చేసే కార్యకర్తలకి పదవులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అనంతరం భావి భారత ప్రధాని భారతదేశ కాంగ్రెస్ అధినేత యువ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ చల్ల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ రాణి బాయి, మాజీ చైర్మన్ వామన్ రావు, మాజీ ఎంపిటిసి సుధాకర్, కోట సమ్మయ్య, కటకం అశోక్, విలాసరావు, యూత్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.