విద్యార్థులను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
బాన్సువాడ, జూలై 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రం లో మహాత్మా జ్యోతిభ పూలె గురుకుల పాఠశాల లో ఆదివారం రాత్రి జరిగిన ఫుడ్ పాయిజాన్ ఘటన చోటు చేసుకోవడంతో సోమవారం బాన్స్ వాడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాన్స్ వాడ లోని మాత శిశు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించటం జరిగింది. ఈ సందర్భంగా మాజీ రైతుబంధు జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి మాట్లాడుతూ సుమారు 20 మంది విద్యార్తులు వాంతులు వీరేచనలతో ఇబ్బందూలతో బాధపడుతున్నారనీ ఆయన తెలిపారు.
అశ్వస్థకు గురి అయినా విద్యార్హులకు మెరగైన వైద్యం అందచాలని వైద్యులను కోరడం జరిగింది. అదేవిధంగా నిర్లక్ష్యనీకి బాద్యులైన వారిని వెంటనే చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేయడం జరిగింది .ఈ కార్యక్రమం లో బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా. బోడ చందర్.మున్సిపల్ కౌన్సిలర్ లు ఫెరోజ్. మాక్క్బూల్. ఆంజనేయులు. దేవి సింగ్. బాబురావు. బాలకృష్ణ. సాయి. సుధాకర్. లక్ష్మణ్. తదితరులు ఉన్నారు.






