13-09-2025 02:34:33 PM
కలియుగ దైవం తిరుమల, తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న బిఆర్ఎస్ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్..
అమీన్ పూర్ (విజయక్రాంతి): కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామిని భక్తి, విశ్వాసంతో ఐలాపూర్ మాణిక్ యాదవ్ స్నేహితులతో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీవారి కటాక్షం ఎల్లప్పుడూ మన మీద ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖశాంతులతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు. ఆధ్యాత్మిక క్షణాలు జీవితాంతం మధురస్మృతులుగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు.