calender_icon.png 9 June, 2025 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు

09-06-2025 01:54:43 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(Former SIB Chief Prabhakar Rao) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న సిట్ విచారణ(SIT Enquiry)కు సోమవారం హాజరయ్యారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ఏ1గా ఉన్న ప్రభాకర్ రావు నిన్న  రాత్రి అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకొని ఇవాళ సిట్  ముందుకు వెళ్లారు. ప్రభాకర్ నుంచి కీలక సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను గతంలో సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ నలుగురు ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ ఈ రోజు ప్రశ్నిస్తోంది.