దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యం

27-04-2024 01:13:23 AM

జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్

జహీరాబాద్, ఏప్రిల్ 26(విజయక్రాంతి): దేశాభివృద్ధి నరేంద్రమోదీతోనే సాధ్యమవుతుందని జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ అన్నారు. శుక్రవా రం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పార్లమెం ట్ నియోజకవర్గంలోని జహీరాబాద్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి మండల ల్లోని గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆచరణలో సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుందన్నారు.

ఈ ఎన్నికల్లో మరోసారి ఎంపీగా గెలిపిస్తే జహీరాబాద్ పార్లమెంట్  నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులపై పార్టీ నాయకు లు, కార్యకర్తలు ప్రజలకు వివరించి చైతన్య పరచలన్నారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరగా, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు గోదవరి అంజిరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ జైపాల్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షు డు మల్లికార్జున్, సీడీసీ మాజీ చైర్మన్ ఉమాకాంత్‌పాటిల్, నాయకులు పాల్గొన్నారు.