మెదక్ ఎంపీ సీటు కాంగ్రెస్‌దే

27-04-2024 01:15:01 AM

రాజీనామాకు హరీశ్‌రావు సిద్ధంగా ఉండాలి

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు

మెదక్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి) : మెదక్ పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ కైవ సం చేసుకుంటుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ధీమా వ్యక్తం చేశా రు. శుక్రవారం ఆయన మెదక్ నియోజకవర్గం చిన్నశంకరంపేట మండలంలోని టి. మాందాపూర్ రామలయంలో విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులతో మెదక్ ఎంపీగా నీలం మధు గెలు పొందడం ఖాయమన్నారు. రుణమాఫీపై సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగస్టు 15న రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, అన్నివర్గాల అభ్యున్నతికీ పాటుపడు తుందన్నారు. సీఎం ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేస్తాడన్నారు. అధికారం కోల్పో యి ఏం చేయాలో తెలియక సీఎం రేవంత్‌పై, కాంగ్రెస్ పార్టీపై హరీశ్‌రావు పిచ్చి మా టలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 

కాంగ్రెస్‌లో పలువురు చేరిక

మెదక్ మండలం బాలానగర్ గ్రామ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మోహన్‌గౌడ్ ఎమ్మెల్యే రోహిత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అలాగే మెదక్‌లోని ద్వారకా గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మెదక్ పట్టణ, మండలం నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కౌన్సిలర్లు, పట్టణ నాయకులు పాల్గొన్నారు.