calender_icon.png 4 June, 2025 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎన్జీవో ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు

02-06-2025 06:32:37 PM

కరీంనగర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ(Telangana State Formation Day) దినోత్సవ సందర్భంగా  తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, కరీంనగర్ జిల్లా టీఎన్జీవోల సంఘం అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డి స్ధానిక టీఎన్జీవోల సంఘ భవనంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీదర్ బాబు(Minister Duddilla Sridhar Babu)ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్చం ఇచ్చి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే  పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం కార్యదర్శి సంగేం లక్ష్మణ్ రావు, టీజీవోల సంఘం అధ్యక్షుడు మడిపేల్లి కాళి చరణ్ గౌడ్, కార్యదర్శి ఆరవింద్ రెడ్డి, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహ స్వామి, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు ఓంటేల రవీందర్ రెడ్డి, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, కార్యదర్శి వెలిచాల సుమంత్ రావు, తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్, కార్యదర్శి నాగరాజు, రూరల్ అధ్యక్షులు వాస్తవిక్ గౌడ్, కార్యదర్శి కోమ్మేర శ్రీనివాస్ రెడ్డి,  నాల్గవ తరగతి సంఘం అధ్యక్షుడు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్, నాయకులు కేశవ్ రెడ్డి, సబితా, రమేష్ గౌడ్, రాజేశ్వరరావు, కోండయ్య, ప్రసాద్ రెడ్డి, కరుణాకర్, నారాయణ, నర్సయ్య, వపన్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.