05-11-2025 03:33:01 PM
మందమర్రి,(విజయక్రాంతి): సనాతన ధర్మాన్ని పాటిస్తూ, ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికత వైపు నడుస్తూ, భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని పట్టణ ఎస్ఐ ఎస్ రాజశేఖర్, పంచముఖి హనుమాన్ ఆలయ పూజారి డింగరి కృష్ణ చైతన్య ఆచార్యులు, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారు సూరిబాబులు తెలిపారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం పట్టణంలోని పంచముఖి హనుమాన్ ఆలయం నుండి బెల్లంపల్లి మండలంలోని బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వరకు చేపట్టిన మహా పాదయాత్ర ప్రారంభోత్సవానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై, పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ, సనాతన ధర్మాన్ని ఆచరించాలని కోరారు. అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున పాదయాత్రగా ఆ మహాశివుని కొలిచేందుకు తరలి వెళ్లడం శుభప్రదమని ఆన్నారు. ప్రజల్లో భక్తి భావం వెళ్లి విరిసేలా కార్యక్రమాలు నిర్వహించడం అభినంద నీయమని, ఆధ్యాత్మికతను పెంపొందించేలా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నిర్వాహకులను కోరారు. అనంతరం భక్తులకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేసి, పాదయాత్ర భక్తులకు పండ్లను పంపిణీ చేశారు.