03-11-2025 12:59:56 AM
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రచారం
నకిరేకల్, నవంబర్ 2 : బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే పేదల కష్టాలు తీరుతాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపేర్కొన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఆధ్వర్యంలో బోరబండ డివిజన్ లోని వినాయక నగర్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వంతోనే పేదల కష్టాలు తీరుతాయని అయన పేర్కొన్నారు ఆయన వెంట ఆ పార్టీ నాయకులు ఉన్నారు.