03-11-2025 01:01:59 AM
ఉచిత చేప పిల్లల పంపిణీ
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ నవంబర్ 2 : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, ఆదివారం నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం పెద్ద చెరువులో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేప పిల్లల ను చెరువులోవదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియెజకవర్గ వ్యాప్తంగా 223 చెరువుల్లో 1 కోటి 05 లక్షలు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఉచిత చేప పిల్లల పంపిణి కార్యక్రమాన్ని మత్సశాఖ సోసైటి సభ్యులు వినియోగించుకోవాలి ఆయన సూచించారు .
మత్స్యకారులకు వలలు, ఇతర పరికరాలు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి, నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్, పిఏసియస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు ,నాయకులు పన్నాల రాఘవరెడ్డి , గాజుల సుకన్య యాసారపు వెంకన్న, మట్టిపల్లి వీరు, కొండ వెంకన్న గౌడ్, లక్ష్మీనారాయణ, మత్సశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.