calender_icon.png 3 November, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కృషి

03-11-2025 01:01:59 AM

ఉచిత చేప పిల్లల పంపిణీ

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

నకిరేకల్ నవంబర్ 2 : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని  నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  అన్నారు, ఆదివారం  నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం పెద్ద చెరువులో ప్రభుత్వం  అందిస్తున్న ఉచిత చేప పిల్లల ను చెరువులోవదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియెజకవర్గ వ్యాప్తంగా 223 చెరువుల్లో 1 కోటి 05 లక్షలు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఉచిత చేప పిల్లల పంపిణి కార్యక్రమాన్ని మత్సశాఖ సోసైటి సభ్యులు వినియోగించుకోవాలి ఆయన  సూచించారు .

మత్స్యకారులకు వలలు, ఇతర పరికరాలు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి,  నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత  శ్రీనివాస్, పిఏసియస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు,  కౌన్సిలర్లు ,నాయకులు  పన్నాల రాఘవరెడ్డి , గాజుల సుకన్య యాసారపు వెంకన్న, మట్టిపల్లి వీరు, కొండ వెంకన్న గౌడ్, లక్ష్మీనారాయణ, మత్సశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.