07-06-2025 12:05:07 AM
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
దౌల్తాబాద్: అమ్మ వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మాచినపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ మహోత్సవ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాయపోల్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతి గ్రామానికి గ్రామదేవతలు ఎంతో ముఖ్యమని గ్రామ దేవతలను పూజిస్తే గ్రామ ప్రజలు కూడా ఆయురారోగ్యాలతో ఉంటారన్నారు. వచ్చే వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా పడి పంటలు అధికంగా పండి రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ సమన్వయకర్త రణం శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, బీఆర్ఎస్ నాయకులు రాజిరెడ్డి, కర్ణాకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.