calender_icon.png 29 June, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక సంస్థల ఎన్నికలకు బీఎస్పీ సిద్ధం

29-06-2025 01:15:11 AM

 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎనగందుల వెంకన్న

సిద్దిపేట,(విజయక్రాంతి): బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ అధ్యక్షతన సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో శనివారం  జరిగిన సిద్ధిపేట నియోజకవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగందుల వెంకన్న జిల్లా ఇంచార్జ్ గజ్జల తిరుపతి జిల్లా అధ్యక్షుడు కటికల ఓం ప్రకాష్ హాజరై మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమైందని ఈ సందర్భంగా వారు తెలిపారు. జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ సత్తా చాటుతుందని వారు తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నాయని స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా పేదవాడు ఇంకా పేదవాడు గానే ఉన్నాడని వారు అన్నారు.

సామాజిక న్యాయం కేవలం బిఎస్పీ పార్టీతోనే సాధ్యమని వారు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బిఎస్పీని ఆశీర్వదిస్తారని వారు అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వీర్ల మల్లేష్ ముదిరాజ్ జిల్లా కార్యదర్శి కొండనుల నరేష్ అసెంబ్లీ ఇన్చార్జి పంగ బాబు అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కొండపలకల సంపత్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బండారి శంకర్ అసెంబ్లీ కోశాధికారి కర్రె హరికిరణ్ నాగరాజు నంగునూరు మండల అధ్యక్షుడు ముండ్రాతి లింగం సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ స్వామి అజయ్ కిరణ్ స్థానిక నాయకులు పాల్గొన్నారు.